నిర్మల్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ అభివృద్ధి పనులను గురువారం న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులకు గతంలో రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి అదనంగా రూ. కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. 3,4 నెలల్లోనే భవనం పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలోనే అతి పెద్ద అంబేద్కర్ భవన్ మన నిర్మల్ లోనే రాబోతుందని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rahul Gandhi: ఆస్తుల అమ్మకాల్లో కేంద్రం బిజీగా ఉంది.. మీ జాగ్రత్త మీరే చూసుకోండి
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు.. ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్
లాకప్ రూంలో పార్టీ చేసుకున్న గ్యాంగ్స్టర్స్ !