చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు.. ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. నిన్న సీఎం స్టాలిన్ తన తండ్రి, మాజీ సీఎం కరుణానిధి స్మారకాన్ని నిర్మించనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. 39 కోట్ల ఖర్చుతో ఆ స్మారకాన్ని చెన్నైలోని మెరీనా బీచ్లో నిర్మించనున్నారు. కరుణానిధి జీవితానికి సంబంధించిన అంశాలను డిజిటల్ కాంటెంట్ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇక అసెంబ్లీలో విపక్ష సభ్యులు మాట్లాడితే మంత్రులెవ్వరూ వారిని అడ్డుకోవద్దు అని కూడా స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు.