Minister Harish Rao | తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీపడలేదన్నారు. ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి.. అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ నెలకొల్పిందన్నారు.
దరఖాస్తు చేసుకునే అవసరం, లైన్లో నిలుచునే అవస్థలు, దళారుల ప్రమేయం, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను నిరాటంకంగా కొనసాగించారని, ఇప్పుడు అదే తీరిలో రుణమాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారన్నారు. సీఎం రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం అంటూ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.
On the eve of Independence day, Telangana treasury made highest ever payment in the history of state clearing all the farm loans upto Rs99,999. A whooping Rs 5,809.78 crore transferred to 9lakh farmers accounts.
This will be a moment to cherish in the history of Independent… pic.twitter.com/LR1DKNdfX7
— Harish Rao Thanneeru (@BRSHarish) August 14, 2023