రామగిరి, మే 26 : జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో సజావుగా ముగిసింది.
ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్ – 1, 2 పరీక్షకు 340 మంది విద్యార్థులకు 335మంది హాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫీ సూపరింటెండెంట్ నీలంరెడ్డి తెలిపారు. ఉదయం 170మందికి 169మంది, మధ్యాహ్నం 170మందికి 166మంది హాజరైనట్లు పేర్కొన్నారు.