సంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే.. ఉన్నవి ఊడగొడుతున్నది బీజేపీ అని మండిపడ్డారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు హాజరై ప్రసంగించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పార్లమెంట్లో మోదీని నిలదీయాలని బండి సంజయ్కు మంత్రి సూచించారు. ఇప్పటి వరకు యువతకు చేసిందేమీ లేదు.. చేసేది కూడా ఏం లేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి హరీశ్ రావు ప్రశ్నించారు.