TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో 12.39 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
Also Read..
Cm KCR | చింతమడకలో ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు
TS Assembly Elections | కొనసాగుతున్న పోలింగ్.. 11 గంటలకు 20.64 శాతం మేర నమోదు
Minister KTR | ఓ పౌరుడిలా నా బాధ్యతను నిర్వర్తించాను : మంత్రి కేటీఆర్