ములుగు : ఆదివాసీ సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారం జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన షెడ్ నందు మేడారం జాతర నిర్వహణపై ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వివిధ ఆదివాసీ సంఘల పెద్దలు సమావేశంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని, వాటన్నిటిని రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే ఆదివాసీ సంఘాల పెద్దలతో మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మేడారం జాతరలో గిరిజనులను వ్యాపార రంగంలో అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ అవకాశాలు వీరికి కేటాయించే విధంగా చూస్తామన్నారు. భక్తుల సౌకర్యాల నిమిత్తం షెడ్స్ ఏర్పాటు చేసి తాగునీరు, టాయిలెట్ సౌకర్యం కల్పిస్తాం.
అంతేగాని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. గిరిజన సంఘాలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన షేడ్స్లో ఒక దానిని జాతర అనంతరం గిరిజన కళా భవన్ ఏర్పాటు చేసేందుకు ఆదివాసీ సంఘాల అభ్యర్థనను పరిశీలిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు