సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ
అర్వపల్లి, ఆగస్టు 04 : సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతి వారంలో రెండు రోజులు డ్రై డే పాటించాలని లైన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూక్య నగేష్ నాయక్, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, డీపీఎంఓ సురేష్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ లలిత, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.