సాల్టిలో (మెక్సికో): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో ధీరజ్ 10-9తో జపాన్కు చెందిన నకనిషి జున్యను ఓడించాడు. తొలుత ఐదు సెట్లలో (28-28, 28-29, 29-28, 28-30, 28-27) స్కోర్లు 5-5తో సమమవగా షూటాఫ్లో ధీరజ్ ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
తద్వారా ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పతకం గెలిచిన తొలి పురుష ఆర్చర్గా అతడు రికార్డులకెక్కాడు. దుబాయ్ వేదికగా 2007లో జరిగిన ఎడిషన్లో మహిళా ఆర్చర్ డోలా బెనర్జీ స్వర్ణం పతకం నెగ్గింది. ఆ తర్వాత 19 ఏండ్ల పతక నిరీక్షణకు తెరదించుతూ ఈ టోర్నీలో భారత్కు పసిడిని అందించాడు. 2023, 2024 ఎడిషన్లలోనూ ఈ తెలుగు కుర్రాడు ఫైనల్స్కు అర్హత సాధించినా ఉత్తచేతులతోనే వెనుదిరిగినా తాజా ఎడిషన్లో మాత్రం స్వర్ణంతో చరిత్ర సృష్టించడం గమనార్హం.