కొత్తగూడెం, ఆగస్టు 04 : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్ (జీఎం)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీహెచ్.వెంకటరమణకు ఏరియా సివిల్ ఏజీఎం రామకృష్ణ ఆధ్వర్యంలో సివిల్ కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెం ఏరియా అభివృద్ధికి ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, సివిల్ పనుల నాణ్యత, వేగవంతమైన అమలుకు తమవంతు సహకారం అందిస్తామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన జీఎం సీహెచ్. వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపిన వారు, ఏరియా అభివృద్ధి, కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు ఆయన సమర్థవంతమైన నాయకత్వం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ కాంట్రాక్టర్లు సాంబిరాజు, గుట్టకింద శ్రీను, షమీమ్, మల్లయ్య, ఈశ్వరయ్య, శివ పాల్గొన్నారు.