జోగులాంబ గద్వాల : జిల్లాలోని కేటి దొడ్డి మండలం నందిన గ్రామ సమీపంలో యాసిడ్ ట్యాంకర్ ( Acid tanker ) బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పొగలు వస్తుండడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గద్వాల ( Gadwal ) రాయచూరు రహదారి పక్కన ట్యాంకర్ బోల్తాపడడంతో ఏ సమయంలోనైన ప్రమాదం జరగవచ్చని పోలీసులు( Police) , ఫైర్స్( Fire ) సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిందని, యాసిడ్ లీక్, పొగలు చిమ్ముతున్న వైనం పరిసర ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కిలోమీటర్ పరిధి వరకు ఎవరు వెళ్లోద్దని ఎస్సై సూచించారు.