నల్లగొండ : నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటి రెడ్డి ఎన్నిక లాంఛనమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎంసీ కోటిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.
సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం కేసీఆర్ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి కట్టుగా పని చేసి, ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ నాయకునిగా సీఎం కేసీఆర్ గొప్ప పేరు తెచ్చుకున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ కంచు కోటగా మారిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం