సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం వెల్లువలా కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎంపీపీ గుండగాని కవిత, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!