న్యూఢిల్లీ : కొవిడ్-19 తాజా వేరియంట్లు ఎంయూ, సీ.1.2ను భారత్లో ఇప్పటివరకూ గుర్తించలేదని జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్షియం ఇన్సాకాగ్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ శాంపిళ్ల సీక్వెన్సింగ్కు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కన్సార్షియం కోరింది. ఇక బీ.1.621 వేరియంట్ను ఎంయూగా పిలుస్తూ ఆగస్ట్ 30న ఈ స్ట్రెయిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) వేరియంట్స్ ఆఫ్ ఇంట్రస్ట్ (వీఓఐ) జాబితాలో చేర్చింది.
సీ.1.2ను కూడా వీఓఐలో చేర్చింది. అయితే భారత్లో ఎంయూ లేదా సీ.1.2 వేరియంట్ల ఉనికిని ఇప్పటివరకూ గుర్తించలేదని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. భారత్లో డెల్టా, డెల్టా ఉప వేరియంట్లు ఆందోళనకలిగించే వేరియంట్ (వీఓసీ)గా కొనసాగుతున్నాయని పేర్కొంది. పలు దేశాల్లో ఇన్ఫెక్షన్స్ వ్యాప్తికి కారణమవుతున్న డెల్టా వేరియంట్ భారత్లో సెకండ్ వేవ్కు దారితీసింది.