జయశంకర్ భూపాలపల్లి : రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు. రేగొండ మండలం గోరి కొత్తపల్లిలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను అందించాలనే లక్ష్యంతో నకిలీ విత్తనాల వ్యాపారాలను రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని
కొవిడ్ దవాఖానను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి