జయశంకర్ భూపాలపల్లి : జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి పరిధిలోని లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్లో 10 గేట్లు ఎత్తినట్లు సంబంధిత ఇంజినీర్ అధికారులు తెలిపారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాణహిత నదీ జలాలు భారీస్థాయిలో వస్తూ లక్ష్మీ బరాజ్లో కలుస్తుండగా నీటి ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో బరాజ్లో గురువారం 51,900 క్యూసెక్కులతో 11.679 టీఎంసీల నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి 23,900 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి