పెద్దపల్లి : సింగరేణి నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ గురువారం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లోని సింగరేణి భవన్కు వెళ్లి ఆయనను కలిశారు. మంథని నియోజకవర్గంలోని నిర్వాసిత గ్రామాలకు సంబంధించిన వివరాలను వివరించారు. ఓసీపీ-2, ఓసీపీ-3 విస్తరణలో సర్వస్వాన్ని కోల్పోయిన వారికి సింగరేణి ప్రభావిత గ్రామాల పునరావాస ప్యాకేజీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే