జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం శంకులపల్లె వద్ద రూ. 65 లక్షల నిధులతో నూతనంగ నిర్మిస్తున్న మురికి కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికులతో మాట్లాడి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచమంతా విలవిలలాడుతున్నది. ఈ విపత్కర పరిస్థితులలో కూడా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఆభివృద్ధి విషయంలో ఎక్కువ రాజీ పడటంలేదన్నారు. ప్రజలంతా కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్