ములుగు : తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు, తెలంగాణ అభివృద్ధి పట్టనివాళ్లు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ను విమర్శిస్తే సహించం. పార్టీని విమర్శిస్తే అలాంటి వారికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
జల్లా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా..ములుగులోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ పార్టీ తన కుటుంబ సభ్యులైన కార్యకర్తల కోసం బీమా సదుపాయం కల్పించిందన్నారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటాంమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో 12,673 గ్రామకమిటీలు, 143 మున్సిపల్ వార్డు కమిటీలు వేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరు వరకు జిల్లా కమిటీలు పూర్తిచేసుకుని అక్టోబర్ మొదటి వారంలో పార్టీ రాష్ట్రకమిటీ వేసుకుంటామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి వారి కార్యకర్తలకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు.
సమావేశంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, పరిశీలకులు గుడిమళ్ల రవికుమార్, నీల శ్రీధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, గోవింద్ నాయక్, స్థానిక జడ్పిటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad |టీఆర్ఎస్వీ నేతలపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలు
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు