వరంగల్ : సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువులో మంగళవారం ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో కుల వృత్తులకు ఆర్థిక బరోసా కల్పించి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆయా కులాల ఆర్థిక బలోపేతానికి సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతన్నారని మంత్రి తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, మత్స్య శాఖ జిల్లా అధికారి నరేష్ కుమార్, ఎంపీపీ అనిమిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.