హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. బండి నడక యాత్రలో తొండి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ అంటే ప్రజలను పట్టి పీడిస్తూ జలగ పార్టీగా మారిందనారు.
శ్రీకాంతాచారి మరణానికి కారణం చంద్రబాబు- రేవంత్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. శ్రీకాంతాచారికి రేవంత్ రెడ్డి కి సంబంధం ఏంటి. ఆనాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నాడు. సోనియాగాంధీ దయ్యం- బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ అమ్మ దేవత అయిందా అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసేది ఆకలి పోరాటం కాదు- అజీర్తి పోరాటం. తెలంగాణ యువత అమరులు కావడానికి కాంగెస్, టీడీపీ పార్టీలే కర్త, కర్మ అన్నారు. ఫసల్ బీమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తిరస్కరించాయి.
బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పాదయాత్ర చెయ్యాలని సూచించారు.
ఫాదర్ ఆఫ్ ద లాయర్ అరవింద్ ఆయన కుటుంబం అన్నారు. కేటీఆర్ రెండు గంటల స్పీచ్కే బీజేపీ- కాంగ్రెస్ ఉలిక్కి పడుతోందని పేర్కొన్నారు. మేము కూడా రోజూ మీకు లేఖలు రాస్తామన్నారు. నాగార్జున సాగర్ లో పట్టిన గతే హుజురాబాద్లో కాంగ్రెస్ కి పట్టబోతోందని జోస్యం చెప్పారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనిపించలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసింది యువత- పట్టభద్రులు- నిరుద్యోగులేనని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ తరహాలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. హుజురాబాద్ ఎన్నిక తరువాత బండి సంజయ్- రేవంత్ రెడ్డి మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవుతారని జీవన్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ మల్లేశం మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ లేనే లేదు. బీజేపీకి డిపాజిట్లు వస్తయా అని సందేహం వెలిబుచ్చారు. ధర్మపురి అరవింద్ ను త్వరలోనే ప్రజలు నియోజకవర్గ బహిష్కరణ చేస్తారన్నారు.
ఇవి కూడా చదవండి..
Manny Pacquiao | బాక్సింగ్కు గుడ్బై.. దేశాధ్యక్ష పదవిపై గురి
Heavy Rains | కందకుర్తిని ముంచెత్తిన వరద నీరు
దీక్షిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మంత్రి సత్యవతి