నిజామాబాద్ : గులాబ్ తుపాన్ తెలంగాణ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తింది. ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువనున్న మహారాష్ట్రలోని ప్రాజెక్ట్ల గేట్లు ఎత్తివేయడంతో దిగువకు భారీ వరద నీరు చేరుకుంటున్నది. దీంతో జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. మహారాష్ట్రలోని విష్ణు పురి, గైక్వాడ్ ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేయటంతో దిగువ నీరు భారీగా చేరుతున్నది.
అలాగే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా విడుదల చేసిన వరద నీరు కందకుర్తి త్రివేణి సంగమంలో భారీ స్థాయిలో ప్రవేశిస్తుంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతంలో చేతికి వచ్చిన సొయా, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది.