పెద్దపల్లి : దళిత, బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి మంగళవారం భూమి పూజ చేసి మాట్లాడారు.
యువత ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. ఐదు కోట్ల రూపాయలతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. యువత ఉత్సాహంతో స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
భార్యను మోసం చేసిన కేసులో భర్త అరెస్ట్..విచారణలో విస్తుగొలిపే విషయాలు
Leopard attack | చిరుత దాడిలో ఆవు మృతి