వికారాబాద్ : జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో ఓ ఆవుపై చిరుత దాడిచేసి చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శంకర్ అనే రైతుకు చెందిన పొలం వద్ద సోమవారం రాత్రి పశువులపై చిరుత దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది.
దీంతో రైతు శంకర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.