నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాలు చేసి ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు.తాజాగా ఆయన జై భీమ్ అనే మూవీ చూసి ఇందులోని కొన్ని సన్నివేశాలకు చలించి పోయారు. రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకుని రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు. ఒక తప్పుడు కేసు కారణంగా రాజకన్ను భార్య పార్వతి పడిన బాధని చూసి చలించిపోయిన లారెన్స్ వారికి సొంత ఇల్లును నిర్మించి ఇస్తానని వాగ్దానం చేశారు.
28 ఏళ్ల క్రితం జరిగిన ఘోరమైన సంఘటనలను జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల కళ్ల ముందుంచారు.ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించింది. అయితే చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని లారెన్స్ చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అలానే జై భీమ్ చిత్రంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన చిత్ర యూనిట్కు, ఆ చిత్రాన్ని సంచలనంగా మార్చిన నటుడు సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్కు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు లారెన్స్.