కరీంనగర్ : (Huzurabad) హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా టీఆర్ఎస్వీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ వారు కారు గుర్తుకే ఓటేసి గెల్లును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆదివారం ఉదయం టీఆర్ఎస్వీకి చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విద్యార్థులు హుజూరాబాద్లోని వీణవంక మండలంలో విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. పనిచేసే వారికే ఓటేసి గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు విజయరెడ్డి, పాల్ మార్క్స్, కార్తీక్ గౌడ్, మారుతీ ప్రసాద్, మహమ్మద్ రియాజ్ తదితరులు వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వశక్తితో పైకెదిగారని ఈ సందర్భంగా పాల్ మార్క్స్, కార్తీక్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెల్లును గెలిపిస్తాయని అన్నారు. దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళల సంక్షేమమే పరమావధిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవడం వల్లనే అభివృద్ధి కనిపిస్తున్నదని చెప్పారు.
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంటా..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..