న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఇందన కొరత ఏర్పడుతోంది. హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. దాదాపు అన్ని దేశాలకు ఇంధన సెగ తగిలింది. దీంతో కొన్ని దేశాలు తమ ఇంధన పాలసీలో మార్పులు తెస్తున్నాయి. ఆసియా దేశాలు ఇంధనాన్ని ఆదా చేసే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ తన ఇంధనాన్ని సరఫరా చేయలేకపోతున్నది. ఈ నేపథ్యంలో ఏర్పడిన కొరతను తీర్చడం అసాధ్యంగా మారింది. ఆసియా దేశాలకు దాదాపు 90 శాతం ఇంధనం హోర్ముజ్ జలసంధి నుంచే అందుతుంది. ఆసియాకు ఇంధన ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. కానీ ప్రస్తుత దశలో పరిస్థితులు కఠినంగా మారడంతో.. శ్రీలంక(Sri Lanka) ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది.
ఇంధనాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో బుధవారం రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించింది శ్రీలంక. దీనితో పాటు నేషనల్ ఫ్యూయల్ పాలసీని ఆ దేశం రూపొందించింది. ఇంధనం ఖరీదుకు చెందిన ఆ పాస్ ఓ రేషన్ కార్డు తరహాలో పనిచేస్తుంది. ప్రతి ఒక్క వాహనదారుడు నేషనల్ ఫ్యూయల్ పాస్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మయన్మార్లో కూడా ప్రభుత్వం వాహనదారులపై ఆంక్షలు విధించింది. ప్రత్యామ్నాయ దినాల్లో వాహనాలను నడిపాలని సూచించింది. లైసెన్సు ప్లేట్ నెంబర్ల ప్రకారం ప్రత్యామ్నాయ రోజుల్లో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.పిలిప్పీన్స్లో కూడా కొత్త ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. హెల్త్, పోర్ట్స్, వాటర్ సర్వీసెస్, శ్రీలంక కస్టమ్స్కు హాలీడే వర్తించదు. కేవలం స్కూళ్లు, యూనివర్సిటీలు, జుడిషియల్ సంస్థలకు సెలవు వర్తిస్తుంది.