హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ సాయిబాబాను టర్మినేట్ చేయడం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. సాయిబాబా అంగవైకల్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో విడుదలచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి తాను గతంలో లేఖరాసిన విషయాన్ని కేకే గుర్తుచేశారు.
ఇవీ కూడా చదవండి…
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు