TGPSC | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్కు చర్యలు చేపట్టింది టీజీపీఎస్సీ.
సాధారణ అభ్యర్థులను 1:2 రేషియోలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచారు. ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చెక్లిస్ట్ను కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022, డిసెంబరు 9న నోటిఫికేషన్ విడుదలచేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 16 నుంచి 2023, జనవరి 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Group-4 | గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థులకు 30 నుంచి వైద్య పరీక్షలు
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద..
Harish Rao | కరెంట్ కోతలపై శాసనసభలో భట్టికి హరీశ్రావు సవాల్.. తోక ముడిచిన రేవంత్ సర్కార్