జగిత్యాల : జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భాంవంతో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయాతీలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
కొత్త కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆధునిక హంగులతో పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్నాం. 100 పడకల దవాఖాన నిర్మాణం కూడా పూర్తికావస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని వసతులతో 300 పడకల దవాఖాన ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. నూతన కలెక్టర్ కార్యాలయ భవనంతో పాటు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉందన్నారు.
మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాడి పంటలకు నిలయమైన జగిత్యాల జిల్లాను అధికారులు, ప్రజాప్రతినిధులు, బాగా పనిచేసి అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
పాలమూరును సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు