మహబూబ్ నగర్ : జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులు,చెక్ డ్యాముల నిర్మాణంతో జిల్లాలోని భూములన్నింటికి సాగు నీరు అందించి సంవత్సరంలో రెండు పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
బుధవారం ఆయన హన్వాడ మండలం వేపూరు గ్రామంలో రూ.6 కోట్ల 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ రెండు చెక్ డ్యాముల నిర్మాణంతో వేపూర్ గ్రామంలో సుమారు 400 ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద హన్వాడ మండలానికి సాగునీరు అందించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
ఊరు బాగుకోసం చెక్ డ్యాములు చేపట్టా్మన్నారు. ముఖ్యంగా వాగుపై 4 చెక్ డ్యాములు నిర్మించడం వల్ల ఎల్లప్పుడు వాగులో నీరు నిల్వ ఉంటుందని తెలిపారు. ఎండాకాలంలో కూడా నీరు నిల్వ ఉంటుందని, దీని ద్వారా రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జడ్పిటిసి విజయలక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
కరోనా చికిత్స కోసం మావోయిస్టులు.. అరెస్టు చేసిన పోలీసులు