Inter Admissions | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలు పొందేందుకు ఇదే చివరి అవకాశం అని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికారులు సూచించారు.
ఇక ఇంటర్లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ జాబితా ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | 2 రోజుల్లో 35 మంది విద్యార్థులకు విష జ్వరాలా..? సర్కార్ ఏం చేస్తుందని కేటీఆర్ నిలదీత..!
KTR | పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కార్కు కనికరం కలగలేదా..! : కేటీఆర్
KTR | మంచి నీళ్లను కూడా వదలట్లేదు.. ఆ పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్