మహబూబాబాద్ : రాష్ట్రం ఎంత కష్ట కాలంలో ఉన్నా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో రాజీ పడకుండా అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్ , వెన్నాకుల వాణి, యాదగిరి రెడ్డి, భోజ్య నాయక్ పరిపాటి వెంకట్ రెడ్డి, వెన్నకుల శ్రీను, విజయ్, రెహ్మాన్, ఆదిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి