స్టేషన్ ఘన్పూర్/ పాలకుర్తి రూరల్/ బచ్చన్నపేట, ఏప్రిల్ 1: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తామని స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనాపై ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని, మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని అన్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందుతోందని, నిర్లక్ష్యం వహిస్తే తమతోపాటు తమ చుట్టూ ఉన్నవారికి కరోనా వ్యాప్తి చెందుతుందని అన్నారు. దీని నివారణకు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడమే పరిష్కారమన్నారు. సమావేశంలో ఎస్సైలు రమేశ్ నాయక్, మోహన్ బాబు, ఏఎస్సై యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాలని లేకుంటే జరిమానా తప్పదని సర్కిల్ ఇన్స్పెక్టర్ వట్టె చేరాలు హెచ్చరించారు. మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఎస్సై గండ్రాతీ సతీశ్తో కలిసి కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ మాస్కు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలన్నారు.
కార్యక్రమంలో పోలీసులు వెంకన్న, కల్యాణ్, శ్రీనివాస్, ఆర్సీ నాయక్, భాస్కర్, దయాకర్, శ్రీనివాస్, ప్రశాంతి, రాజేందర్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట మండలంలోని బండనాగారంలో జాగృతి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ బీ.రాజు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వెంట శానిటైజర్ తీసుకెళ్లాలన్నారు. 45 ఏళ్లు పై బడిన వారందరూ కరోనా నివారణ టీకా తీసుకోవాలన్నారు. గుంపులుగా ఉన్న చోట జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం సైబర్ క్రైమ్, సీసీ కెమెరాలు, డయల్ 100, గుట్కా, గంజాయి, బాల్య వివాహాలు తదితర అంశాలపై కళాకారులు చైతన్య పర్చారు. కార్యక్రమంలో సర్పంచ్ శివరాత్రి కవితా రాజనర్సు, కానిస్టేబుళ్లు నాగేశ్, దీపక్, కళాకారులు నాగమణి, విలియం, రత్నయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, చిరంజీవి, నారాయణ, విక్రమ్రాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు