నిజామాబాద్ : అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా స్పీకర్ పాల్గొన్నారు.
నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 10 డబుల్ బెడ్ రూం ఇల్లు, ఎస్సీ కమ్యునిటీ భవనం, ముదిరాజ్ సంఘం భవనాలను స్పీకర్ ప్రారంభించారు.
నూతనంగా నిర్మించనున్న 35 డబుల్ బెడ్ రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. రూ. 15 లక్షలతో నిర్మించే పీఏసీఎస్ భవనం, రూ. 30 లక్షలతో నిర్మించే ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులకు, రూ. 9 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవనం, రూ. 5 లక్షలతో జీపి భవనం, రూ. 10లక్షలతో వేయనున్న సిసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. మరో అయిదువేల ఇండ్లను తెచ్చి మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా ఆశయం అన్నారు.
దేశంలో రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్లుగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ.12,000 కోట్ల ఆసరా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు.
రాజకీయాలు హుందాగా ఉండాలి. మైకు దొరకగానే విమర్శలు చేసే ముందు మీ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాలను అమలుచేసి ఇక్కడ మాట్లాడండి అని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం