కిన్షాషా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో డయిచ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇరుము ప్రాంతంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. డయిచ్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు గత వారం చివరలో ఓఫాయే ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 14 కార్లు, రెండు ట్రక్కులను ధ్వంసం చేశారు. నార్త్ కివు ప్రావిన్సుకు వెళ్తున్న కాన్వాయ్పై దయిచ్ మిలిటెంట్లు అటాక్ చేశారు. డీఆర్ కాంగోకు చెందిన సైనికులు, యూఎన్ పీస్కీపర్స్తో వెళ్తున్న వాహనాలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 60 మంది సాధారణ పౌరులు మిస్సైనట్లు వార్తలు వచ్చినా.. వారందరూ దొరికినట్లు కాంగో దళాలు పేర్కొన్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.