ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి
బాసర, జూలై 9 : ట్రిపుల్ఐటీలోని సెక్యూరిటీ, హౌస్కీపింగ్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. ట్రిపుల్ఐటీలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన శుక్రవారం ఆర్జీయూకేటీ వీసీ రాహుల్బోజ్జాతో ఫోన్లో మాట్లాడారు. ట్రిపుల్ఐటీలో పని చేస్తున్న హౌస్కీపింగ్ సెక్యూరిటీ సిబ్బందికి ఈ నెల 7 నుంచి ఆరు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్ణయించారు. విద్యార్థులెవరూ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల పూర్తిగా ప్రారంభమైన తర్వాత పూర్తిగా 30 రోజుల వేతనం చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. 400 మంది సిబ్బంది తమకు ఆరు రోజుల జీతమే ఇవ్వనున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వీసీతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వీసీ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
భైంసా, జూలై 9 : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని దేగాం గ్రామంలో పలువురికి శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందజేయడంతో పాటు ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు కల్పించారని తెలిపారు. అనంతరం నలుగురికి రూ.1.36 లక్షల విలువైన చెక్కులను అందించారు. కార్యక్రమంలో భైంసా మాజీ ఎంపీపీ నంగి రాజేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కార్గిరి సాయినాథ్, అనిల్, బండారి శంకర్, తదితరులు ఉన్నారు.