Kotak Mahindra Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘కోటక్ మహీంద్రా బ్యాంక్’ తన టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సన్నద్ధమైంది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆన్ లైన్ లో సేవింగ్స్ ఖాతాలు తెరవడం గానీ, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీచేయడం గానీ చేయొద్దని కోటక్ మహీంద్రా బ్యాంకును ఆర్బీఐ ఇటీవల ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బ్యాంకు టెక్నాలజీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 మంది ఇంజినీర్లను నియమించుకోనున్నది కోటక్ మహీంద్రా బ్యాంక్. గత రెండేండ్లుగా 500కి పైగా ఇంజినీర్లను నియమించుకున్నదని బ్యాంక్ చీఫ్ టెక్నాలజీ ఈఫీసర్ మిలింద్ నాగ్నూర్ చెప్పారు. గూగుల్, అమెజాన్ డాట్ కాం, పేటీఎం, ఫోన్పే వంటి సంస్థల్లో పని చేసిన ఇంజినీర్లను కోటక్ మహీంద్రా బ్యాంకు నియమించుకున్నదని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ నాగ్నూర్ చెప్పారు.