ఆదిలాబాద్, మే 7(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేస్తూ పకడ్బందీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని సూచించారు. యువనేత పర్యటన నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు విజయం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు, ముఖ్య కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలను మాజీ మంత్రి జోగు రామన్న, అభ్యర్థి అత్రం సక్కు, స్థానిక నాయకులు హాజరై ప్రచారం ఎలా నిర్వహించాలని విషయంలో చర్చించారు. నాయకులు, కార్యకర్తలకు గులాబీ పార్టీ విజయం కోసం సలహాలు, సూచనలు అందజేశారు.
ఇంటింటా ప్రచారం
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసి ముందుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రచా రం చేస్తున్నారు. పట్టణాల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చే సి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రచార రథాలు గ్రామాల్లో తిరుగుతూ పాటల ద్వారా ఓ టర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రచారంలో భాగంగా ప దేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలో పదే ళ్లు అధికారం ఉండగా, 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ విజయం సాధించింది. పదేండ్లుగా పార్లమెంట్ పరిధిలో కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు మో క్షం లభించలేదు. ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్, ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ, ఎయిర్పోర్టు, నవోదయ స్కూల్, ఇతర సమస్యలకు పరిష్కారం కాలేదు. ఇటీవల ఆదిలాబాద్లో పర్యటించిన ప్రధాని మోదీ పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గ్యారెంటీలు అమలుకాకపోగా, విద్యుత్ కోతలు, మంచినీటి సమస్య పరిష్కారం కావడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో గులాబీ శ్రేణుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.