హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పట్టిషం చేసేందుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి హోంమంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా చురుగ్గా పని చేస్తుందని కితాబిచ్చారు.
డైనమిక్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో నగరంలో శాంతి భద్రతలు చాలా వరకు మెరుగ్గా ఉన్నాయన్నారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లను ఆధునికరించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఆటోమెటిక్ సిస్టం మంచి ఫలితాలిస్తున్నదన్నారు. లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్లు నగరంలో జరిగిన బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. షీటీం కూడా సమర్ధవంతంగా పనిచేస్తుందని కొనియాడారు. ఇతర రాష్ర్టాల వారు కూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థను అభినందిస్తున్నారని చెప్పారు.
నగర పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న సేవలను హోంమంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్లతో పాటు నగర అదనపు పోలీస్ కమిషనర్లు షీకా గోయల్, చౌహాన్, అనిల్కుమార్ రాంగోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర, మోండామార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత