యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం వద్ద యాదమ్మ అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ నేపథ్యంలో వృద్ధురాలి మృతిని నిరసిస్తూ ఆమె బంధువులు, గ్రామస్తులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చౌటుప్పల్ ఏసీపీ శంకర్ ఆందోళనకారుతో చర్చలు జరుపుతున్నారు.