KCR | కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ కార్యకర్త సల్వాజీ మాధవరావును శనివారం కలిశారు. సల్వాజీ మాధవరావు 22 రోజుల పాటు కరీంనగర్ జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యారు. ఈ సందర్భగా మాధవరావును కేసీఆర్ పిలిపించుకుని మాట్లాడారు.
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సల్వాజీ మాధవ్ రావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి కరీంనగర్ జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. మాధవరావు అధికార పార్టీని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి మార్చి నెలలో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా లేని విషయాన్ని సృష్టించి, కాంగ్రెస్ యూత్ నాయకుడిని ఎస్సీ కులం పేరిట దూషించాడని అక్రమంగా కేసు నమోదు చేయించి జైల్లో పెట్టారు.