సంగారెడ్డి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు 1,35,0000 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నది. గేట్ల ద్వారా 75,000 వేల క్యూసెక్కులు వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్కు వరద ఉధృతి ఏ సమయంలోనైనా ఇంకా పెరిగే అవకాశం ఉందని, మంజీరా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ