హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ను సామాజిక సేవకురాలు, రామన్ మెగాసెసే అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా స్వీకరించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలని ఆకాక్షించారు. మానవాళికి చెట్లు ఎంతో అవసరం. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తుచేశారు.
ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేసాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపుచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ను ప్రొఫెసర్ శాంతా సిన్హా అభినందనలు తెలియజేసారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?