సూర్యాపేట : వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమైందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్క కుమార్ పిలుపు మేరకు.. సూర్యాపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ లింగయ్య మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్ కుమార్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలిత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని