హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున లేదా ఏదైనా పండుగ రోజున కాని మొక్కలు నాటాలని ఎంపీ కె.కేశవరావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. తన పుట్టినరోజును పురస్కరించుకుని బంజారాహిల్స్లోని తన నివాసంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పాల్గొన్నారో తెలంగాణ అభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. వాతావరణ మార్పులను అరికట్టేందుకు చెట్లు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారురు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కేకే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కేకే తనయ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టీఆరెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్