హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. తిరుచిరాపల్లిలో శ్రీరంగం రంగనాథస్వామిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. ఇవాళ రాత్రికి చెన్నైలోనే బస చేసి, రేపు సీఎం స్టాలిన్ను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.