హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం అమితాబ్ కాంత్కు ఎంపీ సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, వృక్ష వేదం పుస్తక వివరాలు తెలుసుకొని ఎంపీ సంతోష్ కుమార్ ను అమితాబ్ కాంత్ అభినందించారు. ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహా హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇదే విధంగా ముందుకు సాగితే తప్పకుండా పర్యావరణ మార్పులపై విజయం సాధించగలమని అమితాబ్ కాంత్ తెలిపారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ హరిత సవాల్ కి నామినేట్ చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షోకు విశేష స్పందన
Mahatma Gandhi University | ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా