నల్లగొండ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న జరుగాల్సిన పరీక్షలు భారత్ బంద్ కారణంగా వాయిదా వేస్తున్నామని ప పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని రమేష్ తెలిపారు.