మంచిర్యాల : సీఎంఆర్ఎఫ్ నిరు పేదలకు వరని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పల్లె కిష్టయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.5లక్షల ఎల్ఓసీని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అందచేశారు. కిష్టయ్య అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని నిమ్స్లో చేరాడు.
ఈ విషయాన్ని జనగామ ఎంపీటీసీ మారిశెట్టి తరుపతి విప్ బాల్క సుమన్ దృష్టికి తీసుకెళ్లాడు.
వెంటనే స్పందించిన సుమన్ సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 5లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు, ఎంపీటీసీలు చంద్రగిరి శంకర్, జేక శేఖర్, గోమాస రజిత, పుప్పిరెడ్డి మొండక్క, కుంభం సరోజన పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు